Delhi: ‘‘మనం సాధించాం’’.. ధర్మేంద్ర రాజీనామాపై సీజేపీ
Here's what's trending across India right now:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రకటన అనంతరం అక్కడ ఉత్సాహభరితమైన దృశ్యాలు కనిపించాయి. విద్యార్థి నాయకులు, సీజేపీ నాయకులు ఈ రాజీనామాను విద్యార్థి సమాజానికి లభించిన విజయంగా అభివర్ణించారు. తమ నిరసన ఉద్యమం ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని, అయితే తమ మిగిలిన రెండు డిమాండ్లు కూడా నెరవేరే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని వారు తెలిపారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు నిరంతరంగా చేస్తున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వార్త చదివారా: ఇది ప్రజాస్వామ్య విజయం: ఖర్గే
Adding to this, Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
Meanwhile, This website follows the DNPA Code of Ethics .
Source: Eenadu